సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో బుధవారం మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రారంభించే ఆదరణ 3.0లో వడ్డెరలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. రజకులకు ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.