ASF: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో గతంలో ఆడిట్ నిర్వహించగా, ధాన్యం నిల్వలు, లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇటీవల దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల మిల్లుకు చెందిన ఓ వ్యక్తిని విచారించి, కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.