VSP: తూర్పు తీర రైల్వే వాల్తేర్ డివిజన్లో శిలిమ్లిగూడ-కరకవలస మధ్య డబుల్ లైన్, నాన్-ఇంటర్లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ (58501, 58502) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 5 నుంచి 15 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.