VZM: భారత దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేసిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. జొన్నవలస గ్రామంలో జిల్లా దళిత సమ్మేళన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లోగిశ రామకృష్ణ పాల్గొన్నారు.