KMR: కొండాపూర్ గ్రామంలో నేడు నిర్వహించనున్న కుస్తీ పోటీల విజేతకు రూ.2,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి జరుపుల జైల్ సింగ్ తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.