MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శవాన్ని పోస్టుమార్టం కోసం ఉంచగా, కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, మంగళవారం నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, ఎంఎవో రవి ప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషాలను సస్పెండ్ చేశారు.