KNR: జమ్మికుంట పట్టణంలో బ్రిడ్జ్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత నెల 6న జరిగిన బస్సు ప్రమాదంతో దెబ్బతిన్న ఆర్వోబీ బ్రిడ్జికి ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. మళ్లీ ప్రమాదాలు సంభవించక ముందే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.