Draupadi Murmu : సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(TejpurAir Force Station) లో యుద్ద విమానంలో విహరించారు. సుఖోయ్(Sukhoi) లో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ (Pratibha Patil) తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(TejpurAir Force Station) లో యుద్ద విమానంలో విహరించారు. సుఖోయ్(Sukhoi) లో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము నిలిచారు. 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ (Pratibha Patil) తొలిసారి ఈ విమానంలో ప్రయాణించారు. కాగా తేజ్పూర్ విమానాశ్రయం తవాంగ్ సెక్టార్కు దగ్గరగా ఉంటుంది. సుఖోయ్ 30ఎంకేఐ .. ట్విన్ సీటర్ ఫైటర్ జెట్. దీన్ని రష్యా(Russia) కు చెందిన సుఖోయ్ సంస్థ డెవలప్ చేసింది. సుఖోయ్ 30 ఎంకేఐ రెండు సీట్లతో కూడిన ఫైటర్ జెట్ విమానం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఫైటర్ జెట్ను నిర్మించింది. కాగా తేజ్ పూర్ ఎయిర్ ఫోర్సు స్టేషన్ వివాదాస్పదమైనది కావటం గమనార్హం. తవాంగ్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా యుద్ద విమానాలు (Yudda vimanalu) ప్రమాదాలకు గురి అవుతున్నాయి. అలాంటి ప్రదేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించటంతో అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. సైనిక దళాల్లో మనో స్థైర్యం నింపుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | President Droupadi Murmu lands at Tezpur Air Force Station, Assam after taking a sortie in the Sukhoi 30 MKI fighter aircraft pic.twitter.com/xRnjERbEnv