KMM: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి(M)నికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో V.Mబంజరా పోలీస్ తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. ఈరోజు కోర్టులో హాజరు పరచగా పై విధంగా తీర్పునిచ్చారు.