NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో మంత్రిని ఘనంగా సత్కరించారు.