ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజనసంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజేంద్రపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జగదీశ్ నాయక్, తమ సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేశారని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ తెలిపారు.