ATP: గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో రూ.96 లక్షల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం అధికారులు చేపట్టారు. గతవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాంకు గ్రామంలో నూతన రోడ్డు వేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జయరాం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.