కోనసీమ: పి.గన్నవరం మండలం డీఎస్ పాలెం వద్ద గోదావరి నదీపాయ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని కూటమి నాయకులు రెవెన్యూ అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సీఆర్ఆడ్ పరిధిలో అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. తక్షణమే అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు.