NZB: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలూరు మండలం దేగాంలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను డిప్యూటీ DMHO డా.రమేశ్ మంగళవారం ప్రారంభించారు. హైరిస్క్ గ్రూప్ వ్యక్తిని గుర్తించి తగిన పరీక్షలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఆరోగ్య కార్యకర్తపై ఉందన్నారు. ప్రజల్లో టీబీపై అవగాహన పెంచాలని సూచించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, తదితరులు పాల్గొన్నారు.