NLR: వరిసాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని అగ్రికల్చర్ అసిస్టెంట్ నాగేంద్ర తెలిపారు. అనంతసాగరం మండలం లింగంగుంట సచివాలయం పరిధిలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా పొలాలను పరిశీలించారు. వరి సాగులో అధిక దిగుబడులు, తెగుళ్ల నివారణపై ఆయన అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడొద్దని రైతులకు సూచించారు.