BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 1,14,718 మంది రైతుల ఖాతాల్లో రూ.136.93 కోట్ల నిధులు జమయ్యాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నిధులు వానాకాలం సాగు అవసరాలకు రైతులకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.