మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ORR ఎగ్జిట్ వద్ద కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ SOT పోలీసులు అరెస్టు చేశారు. రూ. 50 లక్షల విలువ గల 120.17 కిలోల గంజాయిని వైజాగ్ నుంచి హరియాణాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులలో నలుగురు పరారీలో ఉన్నట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.