E.G: రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్కు నూతనంగా ఏర్పాటైన త్రీ మెన్ కమిటీకి స్వామి భాస్కర్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సూపర్ బజార్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.