ప్రకాశం: గిద్దలూరులో సీడీపీఓ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మంగళవారం అంగన్వాడీ వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.