GNTR: రాజధాని అమరావతి పరిధిలోని తుళ్ళూరు మండలంలో గురువారం వన మహోత్సవం జరగనుంది. ఉదయం 10.30గంటలకు అనంతవరం గ్రామంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. కావున నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.