ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి(మం) దుగ్గిరాల పార్టీ కార్యాలయంలో ఆయనను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.