సత్యసాయి: పెనుకొండ మండలం శెట్టిపల్లిలో శ్రీ రాముల ఆలయ నిర్మాణంలో ఉంది. మంగళవారం దేవాలయ నిర్మాణానికి పెనుకొండ ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి రూ.25,000 విరాళంగా అందజేశారు. గ్రామంలో భక్తుల సహకారంతో కొనసాగుతున్న దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.