PDPL: గ్రామాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తామని, మంతిని ఎంపీడీవో శ్రీజా రెడ్డి అన్నారు.మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఎంపీడీవో శ్రీజారెడ్డి, ఏపీఓ సదానందం ఉపాధి హామీ పనులను సోమవారం పరిశీలించారు. ఎండలు తీవ్రమవుతున్న వేళ పని ప్రదేశంలో నీడ సౌకర్యం, మంచినీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.