KRNL: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం పాములపాడు మండలంలోని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. భాను ముక్కల రాజుకు రూ.38,495, వేంపెంట పెద్ద సుబ్బమ్మకు రూ.1,22,228, ఎర్ర గూడూరు శివుడికి రూ.72,656 మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.