కోనసీమ: చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. ఈ మేరకు స్వామివారికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన ద్వారాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. బుధవారం ఉదయం 7:30కు సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.