GNTR: పొన్నూరు పట్టణంలో మంగళవారం నిషేధిత సట్కా మట్కా జూదం బహిరంగంగా కొనసాగుతోంది. ముబారక్ నగర్, గణేష్ భవన్ రోడ్డు, బాపట్ల బస్టాండ్, మార్కెట్ సెంటర్ ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్నారు. రూ.10కు రూ.800 ఆశ చూపుతూ సామాన్యులను ఆకర్షిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పోలీసుల నియంత్రణ లేకపోవడంతో ప్రజలు కఠిన చర్యలు కోరుతున్నారు.