MBNR: జడ్చర్ల మండలం తుప్పడగడ్డతండాలో రాజేష్ (29) ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వాగు నుంచి ఇసుక తెస్తుండగా ట్రాక్టర్ గుంతలోకి దిగడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.