BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ బొజ్జం మమత-సురేష్ ఆధ్వర్యంలో BPM నాగేశ్వరి గ్రామ ప్రజలకు పోస్ట్ ఆఫీస్ పథకాలను వివరించారు. నాగేశ్వరి మాట్లాడుతూ.. గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక భద్రతకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కరోబార్ పవన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.