మంచిర్యాల: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని లక్షెట్టిపేట పట్టణంతో పాటు జన్నారం, దండేపల్లి మండలాల్లో ఉన్న గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ప్రారంభించారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వారు ముందుగానే పుణ్యా స్నానాలు చేస్తున్నారు.