SRPT: టీబీ(క్షయ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని జిల్లా వైద్యాధికారి కోటా చలం కోరారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. నిక్షయ శిబిర్(వంద రోజుల్లో టీబీ నిర్మూలన)లో భాగంగా రోగులను గుర్తించి, అవగాహన కల్పించాలని సూచించారు. తెమడతో కూడిన దగ్గు రెండు వారాలకు మించి ఉంటే పరీక్షలు చేయించాలన్నారు.