నిర్మల్: గ్రామాలలో ఏర్పడే సమస్యలను పంచాయతీ కార్యదర్శులు పరిష్కరించాలని ఖానాపూర్ మండల ఎంపీడీవో సునీత సూచించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో పాడైన బోర్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని, మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కాకుండా చూడాలన్నారు.