BPT: కారంచేడు-పర్చూరు రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కారంచేడు నుండి పర్చూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.