అన్నమయ్య జిల్లాలో మంగళవారం జరిగిన చంద్రగ్రహణం కారణంగా పలు ప్రముఖ దేవాలయాలను ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఆలయ ద్వారాలకు ముద్ర వేసి, గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.