NZB: నగరంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అహ్మద్ శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా, స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారన్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్కు వివరించారు.