SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని కరెంట్ సబ్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంధువుల దినకర్మకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.