KMM: గొల్లగట్టు లింగమంతుల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి 2 రోజుల సెలవు దినాలుగా ప్రకటించాలని అఖిల భారత యాదవ ఖమ్మం జిల్లా ఆధ్యక్షుడు మల్లిబాబు యాదవ్ కోరారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో శనివారం జరిగిన మండల యాదవ సంఘం సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడాతూ.. గొల్లగట్టు లింగమంతుల జాతర అతి పురాతనమైందని, 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిందన్నారు.