MHBD: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనపై శుక్రవారం దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. మండల పరిధిలోని తూర్పు తండాకు చెందిన మాలోత్ దంజా అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనిపించడం లేదు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దంతాలపల్లి ఎస్సై రాజు తెలిపారు.