MNCL: భీమారం సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.