BHNG: రాజాపీట మండలంలోని చెరువులన్నీ నింపాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతు జేఏసీ నాయకులు ఆదివారం గాంధీ చౌరస్తాలో వినతి పత్రం అందజేశారు. కొత్తగా ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెరువులన్నీ నింపేందుకు ప్రయత్నం చేయనున్నట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. కాలయాపన చేయకుండా పంటలు ఎండిపోక ముందే చెరువులు నింపాలని రైతు జేఏసీ నాయకులు కోరారు.