TPT: పాదయాత్రలో ఇచ్చిన హామీని నారా లోకేశ్ మరచిపోయారని వైసీపీ తిరుపతి ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో లోకేశ్ అన్నారు. అధికారంలోకి రాగానే తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ధరలు తగ్గించి లోకేశ్ తన మాట నిలబెట్టుకోవాలి’ అని భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.