ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో కొన్ని రోజులుగా విద్యుత్ లేని సమస్య తీవ్రంగా నెలకొంది. వైద్యులు మొబైల్ టార్చ్తో రోగులకు చికిత్స చేశారు. జనరేటర్ ఉన్నా వినియోగించకపోవడం గమనార్హం. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గురువారం విద్యుత్ సమస్యను పరిష్కరించారు. స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.