SRD: రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.