NLG: మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల కృష్ణవేణి క్యాన్సర్తో పోరాడుతూ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది. ఆమె భర్త పదేళ్ల క్రితం మరణించాడు. కృష్ణవేణికి నలుగురు ఆడపిల్లలు. మూడో కూతురు ఝాన్సీ వివాహం శుక్రవారం జరగగా శనివారం కృష్ణవేణి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.