ASR: అరకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. అరకు ఎంపీపీ రంజపల్లి ఉషారాణి కాన్పు కోసం ఆసుపత్రిలో చేరి బిడ్డను ప్రసవించారు. ఈమేరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఎంపీపీ ఉషారాణిని పరామర్శించారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.