సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలుగుదేశం పార్టీకి తన వంతు విరాళంగా రూ.10 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. టీడీపీ ఇన్చార్జి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఈ విరాళాన్ని ప్రకటించి, పార్టీ బలోపేతానికి తమవంతుగా సాయం అందిస్తున్నట్టు తెలిపారు.