SRD: సంగారెడ్డి జిల్లాలోని అన్ని ఎమ్మార్సీలు, ప్రభుత్వ పాఠశాలలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల వరకు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.