AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం ఉద్దండపురం గ్రామంలో హోంమంత్రి అనిత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి అందజేశారు.