శ్రీకాకుళం జిల్లాలో శనివారం నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల కేంద్రంలో సుమారు మూడు రోజులపాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మూల్యానికి ప్రక్రియ చీఫ్ ఎగ్జామినర్స్ వంటి 250 మంది అధికారులను నియమించారు.