SKLM: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి ఆదేశించారు. శనివారం నరసన్నపేట కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జూలై 2 ఐదవ తేదీన జరగనున్న లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. పెండింగ్ కేసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.