AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను సిట్ రెండో రోజు కస్టడీకి తీసుకుంది. ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు చేసి, సిట్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు విచారించనున్నారు.